Time Room

Shreyas Iyer: మద్దతు: పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ & more related news here

Shreyas Iyer: మద్దతు: పంజాబ్ కెప్టెన్ శ్రేయస్

 & more related news here


ఇంటర్నెట్ డెస్క్‌: కీలక సమయంలో పంజాబ్ కింగ్స్‌ విజయం సాధించింది. వరుసగా ఆరు మ్యాచుల తర్వాత వచ్చిన గెలుపు ఇది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై అద్భుత శతకంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (101*) రెచ్చిపోయాడు. ఐపీఎల్‌ కెరీర్‌లోనే తొలి సెంచరీ గమనార్హం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డునూ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో తమ ప్లేఆఫ్స్ అవకాశాలపై శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  • పంజాబ్ ముందడుగు.. రాజస్థాన్‌ - కోల్‌కతా సంగతేంటి?

”నేను చాలా సంతోషంగా ఉన్నా. ఈ సీజన్‌లో తొలి శతకం నమోదు చేశా. See More బాగుంది. వరుసగా ఆరు ఓటముల తర్వాత విజయం సాధించాం. ఇది మాకు సానుకూలాంశం. ఇక ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే మా ఆశలన్నీ ముంబయి – రాజస్థాన్ మ్యాచ్‌పైనే ఉన్నాయి. మా అభిమానులు ముంబయికి మద్దతుగా నిలవి ఆశిస్తున్నా. లఖ్‌నవూపై మా బౌలర్ల ప్రదర్శన చాలా బాగుంది. తొలి ఓవర్‌లోనే 16 పరుగులు ఇచ్చినా.. పుంజుకొన్నాం. అజ్మత్ అద్భుతంగా బౌలింగ్‌ వేశాడు. కీలక వికెట్‌ను తీసి ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక యుజ్వేంద్ర చాహల్ పరుగులను నియంత్రించడంతోపాటు వికెట్లు పడగొట్టాడు. రిషభ్‌ పంత్‌ను ఔట్ చేశాడు. దూకుడుగా ఆడిన ఆయుష్ బద్ చేర్చాడు. అక్కడ్నుంచి లఖ్‌నవూ పరుగుల మందగించింది” అని శ్రేయస్ తెలిపాడు.

మా టీమ్‌కు అదే చెప్పా

” ఒకటే చెబుతా.. ఉంచండి. అంతేకానీ, మీటింగ్‌లు పెట్టి కుర్రాళ్లను ఒత్తిడికి గురిచేయను. ఆడే వాతావరణం కల్పిస్తా. అతిగా ఆలోచించే పరిస్థితినఱ రానివ్వను. మ్యాచ్‌కు ముందు కూడా రికీని అడిగా.. ఇవాళ ఎలాంటి మ్యాచ్‌ మీటింగ్‌లు వద్దని కోరా. నేరుగా మైదానంలోకి దిగి ఏం చేయాలో అదే చేద్దామని జట్టును ఉత్సాహపరిచా. ”’ అని కెప్టెన్ శ్రేయస్ వెల్లడించాడు.



Source link

Exit mobile version