Tanikella Bharani in Modi,Tanikella Bharani: ‘మోదీ చేతిని ముద్దెట్టుకున్నా.. నా జన్మ ధన్యం’… పోస్ట్ – actress tanikella bharani meets prime minister narendra modi shares emotional post & more related news here

Tanikella Bharani in Modi,Tanikella Bharani: ‘మోదీ చేతిని ముద్దెట్టుకున్నా.. నా జన్మ ధన్యం’… పోస్ట్ – actress tanikella bharani meets prime minister narendra modi shares emotional post

 & more related news here


Tanikella Bharani on PM Modi: నటుడు, రచయిత తనికెళ్ల భరణి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తన అభిమానాన్ని చాటుకున్నారు. మోదీని రాముడు, కృష్ణుడు, వివేకానందుడి అంశగా అభివర్ణించిన భరణి.. ఆయన చేతిని ముద్దాడటంతో తన జన్మ ధన్యమైందని పేర్కొన్నారు. గతంలోలూ భారతీయ సంస్కృతికి దక్కుతున్న గౌరవం పట్ల తన అచంచలమైన విశ్వాసాన్ని తనికెళ్ల భరణి వ్యక్తం చేశారు.

Actress Tanikella Bharani meets Prime Minister Narendra Modi and shares an emotional post
‘మోదీ చేతిని ముద్దెట్టుకున్నాను.. నా జన్మ ధన్యం’…(ఫోటోలుsamayam telugu)
సీనియర్ నటుడు, రచయిత తనికెళ్ల భరణి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాలు, సినిమా సంగతులు, శివతత్వం గురించి ఎక్కువగా పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చ్రస్తుతం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆయన్ను కలిసిన భరణి.. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీపై తనకున్న ప్రేమాభిమానాలను, గౌరవాన్ని తనికెళ్ల భరణి తాజాగా పోస్ట్ పెట్టారు. మోదీని రాముడు, కృష్ణుడు, ఆదిశంకరుడు, వివేకానందుడితో పోల్చారు. మోదీని నేరుగా చూడటమే కాదు, ఆయన చేతిని ముద్దాడానని, తన జన్మ ధన్యమైందని పేర్కొన్నారు. ” ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. అంటే చూడలేము కూడా. కానీ వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను. ” చేశారు. ప్రధానితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసుకున్నారు.

హిందూత్వ భావజాలం, శివతత్త్వం పట్ల అచంచలమైన విశ్వాసం కలిగిన తనికెళ్ళ భరణి.. మోదీని పురాణ పురుషుల అంశగా పోల్చడం చర్చనీయాంశంగా మారింది. భరణి గతంలోనూ పలు సందర్భాల్లో మోదీ గొప్పదనాన్ని కొనియాడారు. More information. › వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రి మోడీ ఆదివారం (మే10) పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఆయనకు ఇదే తొలి తెలంగాణ పర్యటన. సుమారు ఏడు గంటలపాటు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేసిన మోదీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు. శస్త్రచికిత్స జరిగి విశ్రాంతి తీసుకొంటున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. హెటిర౫ ప్రారంభించారు. తిరీ మోడీని కలిశారు తనికెళ్ల భరణి. ఈ సందర్భంగా మోడీకి నమస్కారం చేయగా, ప్రధాని ఆయన్ని దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా పలకరించారు. ఈ ఫొటోనే భరణి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

తనికెళ్ల భరణి కేవలం నటుడిగానే కాకుండా కథా రచయితగా, దర్శకుడిగా, కవిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించిన ఆయన, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించారు. ముఖ్యంగా డైలాగ్ రైటర్‌గా ‘శివ’, ‘మనీ’ వంటి చిత్రాలతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. నటన, రచన విభాగాల్లో ఆయన అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘మిథునం’ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని చాటిచెప్పింది.

రాజశేఖర్. జి

రచయిత గురించిరాజశేఖర్. జి‘సమయం తెలుగు’లో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు కంటెంట్ రైటింగ్‌లో 7 min అనుభవం ఉంది. 2025లో సమయంలో చేరిన రాజశేఖర్… లేటెస్ట్ అప్‌డేట్‌లు, విశ్లేషణలు, స్పెషల్ స్టోరీలు రాస్తున్నారు. సినిమాల గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. సోషల్ మీడియా పోస్టులను ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. రాజశేఖర్ జేఎన్‌టీయూ-హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ నుంచి ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ పొందారు. తుపాకీ న్యూస్, ఏబీపీ దేశం, ఇండియా హెరాల్డ్ డాట్ కామ్ లాంటి మీడియా సంస్థల్లో సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు. Year 2019 ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడాన్ని ఆయన ఇష్టపడతారు.ఇంకా చదవండి